DESIGNED BY P.V.RAVIKANTH

Monday, 28 December 2020

అమ్మఒడి అర్హుల తల్లిదండ్రులకు మనవి:

 అమ్మఒడి అర్హుల తల్లిదండ్రులకు మనవి:

***********

    2020-21విద్యాసంవత్సరం విద్యార్ధుల అమ్మఒడి అర్హుల ల తల్లిదండ్రుల లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటే అటువంటి వారు రేపు ZPH స్కూల్ రావినూతల కు వచ్చి మీ అంతట మీరే మీ పిల్లవాల్ల పేరును అమ్మఒడి అర్హుల జాబితాను నుండి తొలగించుకోవాలి. 

     మీ పిల్లలు పేర్లు తొలగించమని ప్రధానోపాధ్యాయులు కు లెటర్ ఇచ్చి తొలగించుకోవాలి. అట్లు చేయనిచో ప్రభుత్వం ఉత్తర్వులు ప్రకారం వారు తీసుకోను చర్యలకు మీరే బాధ్యులు.

  ప్రభుత్వ ఉద్యోగులు:

1) అన్నిరకాల సచివాలయం ఉద్యోగులు

2) అంగన్వాడీ కార్యకర్తలు

3) ఆశా వర్కర్లు

4)VRO లు

5)VRA లు.

6)ఆర్టీసీ ఉద్యోగులు

7) అన్నీ రకాల ప్రభుత్వ ఉద్యోగులు

8) బ్యాంక్ ఉద్యోగులు

9) గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ.10,000/- మరియు పట్టణ ప్రాంతాల లో నెలకు రూ.12,000/- లు జీతం తీసుకొనే ప్రభుత్వ మరియు "కాంటాక్ట్ ఔట్ సోర్సింగ్" ఉద్యోగులు "ప్రభుత్వం ద్వారా జీతం తీసుకొనే అన్నీ రకాల ఉద్యోగులు" అందరూ అమ్మఒడి పథకం కు అనర్హులు.

    కావున పైన తెలిపిన విధంగా ఉద్యోగుల పిల్లలు ఎవరైనా ఈ అమ్మఒడి పథకం లో అర్హుల జాబితా లో ఉన్నటైతే వెంటనే/రేపు అనగా 29/12/2020 మంగళ వారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రావినూతల కు వచ్చి మీ పిల్లలు పేర్లు తొలగించమని ప్రధానోపాధ్యాయులు కు లెటర్ ఇచ్చి తొలగించుకోవాలి. అట్లు చేయనిచో ప్రభుత్వం తీసుకొను చర్యలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుగాని,ఉపాధ్యాయులకు గానీ ఎలాంటి సంబంధం లేదని ఇందుమూలంగా విజ్ఞప్తి చేస్తున్నాను.

                     ఇట్లు 

          ప్రధానోపాధ్యాయులు

   Rvn ZPH స్కూల్- రావినూతల.

Popular Posts